News March 26, 2024
శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78371 మంది భక్తులు దర్శించుకోగా 25156 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు లభించింది.
Similar News
News April 11, 2026
వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News April 11, 2026
350 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇండియన్ బ్యాంక్ 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్, HRలో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్తో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ ఏప్రిల్ 28. బీటెక్, MCA, MBA, CA, ఏదైనా పీజీ చేసి ఉండాలి. మరిన్ని వివరాలకు https://indianbank.bank.in/career/ చూడండి.
News April 11, 2026
ChatGPT సృష్టికర్త ఆల్ట్మన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

చాట్జీపీటీని క్రియేట్ చేసిన OpenAI CEO సామ్ ఆల్ట్మన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు ఆయన నివాసంపై దాడి చేసి ఆఫీసును తగులబెడతానని బెదిరించాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. తన ఫ్యామిలీ సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆల్ట్మన్ AI పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, తనపై వస్తున్న విమర్శలే ఈ దాడులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.


