News April 2, 2025

RGM: NTPC విద్యుత్ పరిశ్రమలో 15, 037M.Uప్రొడక్షన్

image

రామగుండం NTPCవిద్యుత్ పరిశ్రమలో గత ఆర్థిక సంవత్సరంలో 15,037 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ఉత్పత్తి సాధించినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 500 మెగావాట్ల 4వ యూనిట్లో 280 రోజులలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టి రికార్డు సృష్టించిందన్నారు. 200 మెగావాట్ల 3వ యూనిట్‌లో వంద రోజులపాటు పనిచేసి అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు. 62% శాతం PLFనమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News December 27, 2025

పల్నాడు జిల్లాలో ఉపాధి హామీ పనులలో అక్రమాలు.!

image

ఉపాధి హామీ పథకం కూలీల కాకుండా అక్రమార్కులకు వరంగా మారింది. డ్వామా ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తుండగా, కోట్లల్లో అక్రమాలను గుర్తించిన రికవరీ చేయడం లేదు. సోషల్ ఆడిట్ పేరుతో అధికారులు కాలక్షేపం చేయడానికి పరిమితం అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో సోషల్ యూనిట్ 790 పనులులో అక్రమాలు గుర్తించారు. రూ.2,11,94,590 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని నిర్ధారించారు. రూపాయి కూడా రికవరీ చేయలేదు.

News December 27, 2025

రేపు ట్రంప్‌తో జెలెన్ స్కీ భేటీ!

image

US అధ్యక్షుడు ట్రంప్‌తో రేపు ఫ్లోరిడాలో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు, శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదించిన 20సూత్రాల ప్రణాళికలో 90% మేర ఏకాభిప్రాయం కుదిరిందని జెలెన్ స్కీ చెప్పారు. రేపటి భేటీలో ఉక్రెయిన్‌కు US ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. కొత్త ఏడాదికి ముందే కీలక పరిణామాలు సంభవించొచ్చని తెలిపారు.

News December 27, 2025

ఉమ్మడి KNRలో ‘ఎక్సైజ్’ అధికారుల ‘EXTRA దందా’..!

image

ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల ఓనర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి KNRలో 287 WINES ఉండగా రూ.7 కోట్ల టార్గెట్‌తో ఒక్కో షాప్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఇవే కాకుండా నెలకు రూ.15000లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారట. దీంతో కొందరు మద్యం వ్యాపారులు మామూళ్లు చెల్లిస్తుండగా మరి కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారట.