News April 2, 2025

కడవెండికి చేరుకున్న మావోయిస్టు రేణుక మృతదేహం

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన ఎడిటర్ ప్రభాత్ పత్రిక సంపాదకురాలు గుమ్మడివెల్లి రేణుక ఎన్‌కౌంటర్‌లో సోమవారం మృతి చెందారు. కాగా, బుధవారం తెల్లవారుజామున సొంత గ్రామం కడవెండికి రేణుక మృతదేహం చేరుకుంది. మధ్యాహ్నం అంతిమ యాత్ర ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కామ్రేడ్ రేణుకను కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

ఏలూరు: భక్త కనకదాసుకు నివాళులర్పించిన కలెక్టర్

image

భక్త కనకదాసు జీవితం మనందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శనివారం ఏలూరు కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి కార్యక్రమం జరిగింది. భక్త కనకదాసు చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్త కనకదాసు విశిష్టమైన కవిగా, తత్త్వవేత్తగా, గొప్ప సామజిక సంస్కర్తగా పేరుగాంచారని కొనియాడారు. ఆయన రచనలు, కీర్తనలు ప్రజలకు భక్తిని మానవత్వాన్ని  బోధించాయన్నారు.

News November 8, 2025

మచిలీపట్నం: కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి

image

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాలులో భక్త కనకదాసు జ‌యంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, యోధుడు అని తెలిపారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్‌: 3 రోజులు సెలవులు.. 2 రోజులు 144 సెక్షన్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు 11న నియోజకవర్గంలోని Govt, Pvt ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది.10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్లలకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. అలాగే 10న సా.6 గం. నుంచి 11న సా.6 వరకు, 14న ఉ.6 గం. నుంచి 15న ఉ.6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.