News April 2, 2025

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళి

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Similar News

News November 8, 2025

ఇజ్రాయెల్ PM అరెస్టుకు తుర్కియే వారెంట్

image

గాజాలో విధ్వంసం, నరమేధానికి కారణమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీచేసింది. ఆయనతో పాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37 మందిని వారెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.

News November 8, 2025

HYD-VJD హైవే 8 లేన్లకు విస్తరణ: కోమటిరెడ్డి

image

HYD-VJD జాతీయ రహదారి 8 లేన్లకు విస్తరించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రూ.10,400 కోట్లతో ఈ రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. దండు మల్కాపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు ఈ రోడ్డును ఎక్స్ ప్యాండ్ చేస్తామన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 4 వరుసల రోడ్డు 8 వరుసలుగా మారనుంది. గతంలో ఆరు లేన్లుగా నిర్మించాలనుకున్నప్పటికీ రద్దీ దృష్ట్యా 8 లేన్లుగా విస్తరించనున్నారు.

News November 8, 2025

కంచిపల్లి శ్రీను హత్య కేసులో 8 మంది అరెస్టు

image

అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను హత్య కేసులో 8 మందిని అరెస్టు చేశామని ఎస్పీ రాహుల్ మీనా శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. తన ఉనికిని చాటుకునేందుకే ప్రధాన నిందితుడు కాసుబాబు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. దూషిస్తూ శ్రీను విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరువు పోతుందని భావించి హత్యకు ప్లాన్ చేశాడని చెప్పారు.