News April 2, 2025
KMR: ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు: డీఈఓ రాజు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించినట్టు జిల్లా డీఈఓ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. (సమ్మేటివ్ -2) వార్షిక పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థులకు పరీక్షలకు సంసిద్ధం చేయాలని ఆయన కోరారు. అనంతరం 12:30కి మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంటుందని తెలిపారు.
Similar News
News January 12, 2026
కృష్ణా: రికార్డు స్థాయి పందేం ఇదే.. అందరి నోట ఒక్కటే మాట!

కోడి పందేల చరిత్రలో రికార్డు స్థాయి పందేలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సీసలి బరిలో జరిగిన రూ. 25 లక్షల పందెం ఒక ఎత్తైతే, తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ. 1.25 కోట్ల పందేం జరగడం పందెం రాయుళ్లను విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ప్రభాకర్ ఈ భారీ పందేంలో నెగ్గి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ప్రాంతంలో పందేలకు క్రేజ్ అమాంతం పెరిగింది.
News January 12, 2026
పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు

పంట అవశేషాలను కాల్చితే నేలలో కార్బన్ శాతం తగ్గిపోతుంది. నేల ఉపరితలం నుంచి 1cm లోపలి వరకు ఉష్ణోగ్రత 8 డిగ్రీలు పెరిగి నేలలో పంటకు మేలు చేసే బాక్టీరియా, ఫంగస్ నాశనమవుతాయి. వీటిని కాల్చేటప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ఒక టన్ను పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల ఉపరితలంలో 5.5kgల నత్రజని, 2kgల భాస్వరం, 2.5kgల పొటాష్, 1kg సేంద్రియ కర్బనం నష్టపోతాం.
News January 12, 2026
ADB: మున్సిపల్ పోరుకు ‘గులాబీ’ వ్యూహం

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ జండా ఎగిరేసి వైభవం సాధించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మక పావులు కదుపుతోంది. మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా సమాయత్తమవుతోంది. సర్కార్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఎన్నికల్లో విజయం సాధించేలా అభ్యర్థులను రంగంలోకి దించాలని అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో చూపిన సత్తాను మున్సిపల్ పోరులోనూ పునరావృతం చేయాలని నిర్ణయించింది.


