News April 2, 2025
KMR: ‘పరీక్షల భయానికి తెర.. విద్యార్థుల్లో ఆనందం’

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సాంఘిక పరీక్ష సజావుగా జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చివరి పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు 12,550 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.
Similar News
News November 10, 2025
HYD: మన కోసం మరో గంట పెంపు

జూబ్లీహిల్స్లో ఓటు వేసే వారికి EC శుభవార్త చెప్పింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగేది. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. 2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 47.49% శాతం మందే ఓటేశారు. ఈ పరిస్థితి మారాలని ఎన్నికల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. మన కోసం మరో గంట సమయం ఇచ్చారు. వెళ్లి ఓటేయండి.
SHARE IT
News November 10, 2025
HYD: మన కోసం మరో గంట పెంపు

జూబ్లీహిల్స్లో ఓటు వేసే వారికి EC శుభవార్త చెప్పింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగేది. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. 2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 47.49% శాతం మందే ఓటేశారు. ఈ పరిస్థితి మారాలని ఎన్నికల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. మన కోసం మరో గంట సమయం ఇచ్చారు. వెళ్లి ఓటేయండి.
SHARE IT
News November 10, 2025
విజయవాడలోని ఈ ప్రాంతాలపై దృష్టి సారించండి సార్.!

విజయవాడ బెంజ్సర్కిల్, ప్రభుత్వాసుపత్రి సర్వీస్ రోడ్ ప్రాంతాలు వ్యభిచారానికి అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రాత్రి 8 గంటల నుంచి కొందరు మహిళలు రోడ్డుపై ఉంటూ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. వీరు విటులను సమీపంలోని లాడ్జిలకు తీసుకువెళుతున్నారని, పలువురిని బెదిరించి నగదు దోచుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


