News March 26, 2024

శ్రీకాకుళం: ఇసుక లారీ ఢీకొని సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

image

పలాస మండలం కోసంగిపురం జంక్షన్ వద్ద మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ వెనుక చక్రాల కింద సోంపేట మండలం జీడీపుట్టుక గ్రామానికి చెందిన చెల్లురి చైతన్య తీవ్ర గాయాలపాలయ్యాడు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడు ఇటీవల సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News July 5, 2024

శ్రీకాకుళం: అధికారులు అంకిత భావంతో పనిచేయాలి

image

అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతీ లబ్ధిదారునికి అందించే దిశగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: 8 నుంచి ఎయిర్‌ఫోర్స్‌కు దరఖాస్తులు

image

అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేయుటకు ఆసక్తి ఉన్న వారు ఈనెల 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. అవివాహిత యువత ఇంటర్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

News July 5, 2024

అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి

image

అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.