News April 2, 2025

BREAKING: గద్వాలలో విషాదం

image

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గద్వాల మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నవీన్(30) వీరాపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఐరన్ విద్యుత్ వైర్లపై పడి కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News January 11, 2026

షూటింగ్ బాల్‌లో శ్రీ సత్యసాయి జిల్లాకు 3వ స్థానం

image

బాపట్లలో నేటితో ముగిసిన 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ జూనియర్ విభాగంలో శ్రీ సత్యసాయి జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు జిల్లా సెక్రటరీ పూల ప్రసాద్ తెలిపారు. ఈ నెల 9న మొదలైన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి మొదటి సారి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు జిల్లా సెక్రటరీ లక్ష్మీనారాయణ అభినందించారు. జట్టుకు పీఈటీలుగా ఉమాదేవి, ప్రసన్నలక్ష్మి, అరవింద్ వ్యవహరించారు.

News January 11, 2026

నెల్లూరు: మీకు విద్యుత్ సమస్యలా.?

image

నెల్లూరు జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం “డయల్ యువర్ ఎస్ఈ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 0861–2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నేరుగా తెలియజేయవచ్చు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News January 11, 2026

హుజూరాబాద్‌: లాడ్జీలో యువకుడి ఆత్మహత్య

image

హుజూరాబాద్‌‌లోని వైస్రాయ్ లాడ్జీలో వడ్లకొండ చిరంజీవి(30) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలోరిపల్లికి చెందిన చిరంజీవి, 2 రోజుల క్రితం లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం నుంచి అతను ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు సాయంత్రం లాడ్జీకి చేరుకొని, గది కిటికీలో నుంచి చూడగా చిరంజీవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.