News April 2, 2025
KMR: సన్నం బియ్యం పంపిణీ ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో సన్నం బియ్యం పథకాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం నాణ్యతను, తూకాన్ని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందుతాయని కలెక్టర్ తెలిపారు. పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా రేషన్ షాపుల్లో అధికారులతో తనిఖీలు చేయించినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 28, 2025
PHOTO: వరి నాట్లు వేసిన బండారు శ్రావణి

శింగనమలలోని శివాలయం పరిసర ప్రాంతాలు, శ్రీరంగరాయ చెరువు ఆయకట్టు పరిధిలో కూలీలతో కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వరి నాట్లు వేశారు. రబీ సీజన్లో వరి పంటకు సాగునీటి కోసం ఆందోళన చెందుతూ రైతులు ఇటీవల ఎమ్మెల్యేను కలిశారు. వారి అభ్యర్థన మేరకు ఇవాళ పొలాలను సందర్శించి, పరిశీలించారు. సాగు పరిస్థితులు, సాగునీటి సమస్యలపై రైతులతో మాట్లాడారు. సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
News December 28, 2025
ఆ అధికారుల చొరవతో గుంటూరు జిల్లా శుభిక్షం

2025లో గుంటూరు జిల్లా వరుస తుఫాన్లు, ప్రమాదాలు, ప్రకృతి వపత్తులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
సమర్థవంతమైన పాలనతో వాటి నుంచి జిల్లాను సురక్షితంగా నడిపించిన నలుగురు అధికారుల పాత్ర కీలకంగా నిలిచింది. అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి, SP సతీష్ కుమార్తో పాటు ప్రస్తుత కలెక్టర్ తమీమ్ అన్సారియా, SP వకుల్ జిందల్ సమన్వయంతో తీసుకున్న చర్యలతో జిల్లా శుభిక్షంగా ఉందని ప్రజలు అంటున్నారు.
News December 28, 2025
పని గంటలు కాదు.. శ్రద్ధ ముఖ్యం: ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే ఎంత శ్రద్ధగా పనిచేశామనేది ముఖ్యమని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎస్డీ శిబులాల్ అన్నారు. ‘పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్కు టైమ్ కేటాయించేందుకు ప్రతి ఒక్కరికీ ఛాన్స్ ఉంటుంది. కేటాయించిన టైమ్లో 100% ఫోకస్డ్గా ఉండాలి. సమయపాలనలో ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్లు వారికి ఉంటాయి’ అని చెప్పారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్ చేసిన విషయం తెలిసిందే.


