News April 2, 2025

కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులకై విజ్ఞప్తి

image

AP: కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడపాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. విమాన సర్వీసులూ అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

Similar News

News September 11, 2025

నా కుమారుడు YSR వారసుడే: షర్మిల

image

AP: YCP, జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘నా బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే YCP ఇంతలా రియాక్ట్ అవుతోందంటే భయమా? నా కుమారుడికి రాజారెడ్డి అనే పేరు YSR పెట్టారు. ఎవరెన్ని వాగినా నా కొడుకు ఆయన వారసుడే. జగన్‌కు అసలు ఐడియాలజీ ఉందా? YSR బతికి ఉండి ఉంటే మీరు చేసిన పనికి తలదించుకునేవారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News September 11, 2025

గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు TGPSC..!

image

TG: <<17655670>>గ్రూప్-1<<>> మెయిన్స్ ఫలితాల రద్దు తీర్పుపై అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై కమిషన్ ఇవాళ సమావేశమైంది. బెంచ్ తీర్పును సవాల్ చేసేందుకు లీగల్ టీమ్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తోంది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు TGPSC వర్గాలు తెలిపాయి.

News September 11, 2025

రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.