News April 3, 2025
బెల్లంపల్లి: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: MLA

గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లోనూ రాణించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మండలంలోని తాళ్లగురజాల గ్రామంలో నిర్వహించనున్న వాలీబాల్ పోటీల క్రీడా కిట్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రామ్ చందర్, నాయకులు రామన్న, సురేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.
Similar News
News October 19, 2025
విజయవాడ: పర్యాటకులకు గుడ్ న్యూస్

విజయవాడ భవాని ఐలాండ్లో ఆదివారం నుంచి బోటు షికారు తిరిగి ప్రారంభమైంది. గత 60 రోజులుగా ఎగువ నుంచి కురుస్తున్న వర్షాల ఉధృతి, వర్షాల కారణంగా కృష్ణా నదిలో బోటు షికారు నిలిచిపోయింది. ఆదివారం బోటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో టూరిస్టులు బోటు షికారుకు ఆసక్తి చూపారు. కాగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ జరుగుతోంది.
News October 19, 2025
పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
నిర్మల్: టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

చెడుపై మంచి విజయం సాధించిన ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని, ప్రతి ఇంటిలో ఆనందం, వెలుగు నిండాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధి కలగాలని కోరుకుంటూ, టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.