News April 3, 2025

తాండూర్: తాగొచ్చి.. భార్య, అత్తను కొట్టాడు: SI

image

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య, అత్తను కొట్టిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మార్చి 16న అచలాపూర్ గ్రామపంచాయతీ కొమ్ముగూడెంకు చెందిన దాగం మల్లేశ్ అనే వ్యక్తి మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడ్డారు. భార్య లావణ్య, అత్త రాజు అడ్డుపడగా.. వారిని కబ్గిరి గరిటతో తలపై బలంగా కొట్టి గాయపర్చాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

శ్రీ సత్యసాయి, అనంతలో ‘స్క్రబ్ టైఫస్’ కలకలం

image

కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ అనంత జిల్లాకూ పాకింది. రాయదుర్గం సమీపంలోని తాళ్లకెరకు చెందిన బాలిక జ్వరంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి రాగా రక్తపరీక్షలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి(D) ముదిగుబ్బ మండలానికి చెందిన గర్భిణి ప్రసవం నిమిత్తం చేరారు. జ్వరం ఉండటంతో ఆమెకూ పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 2 రోజుల క్రితం హిందూపురంలో ఓ మహిళకు స్క్రబ్ టైఫస్ సోకింది.

News December 10, 2025

వణుకుతున్న కర్నూలు, నంద్యాల జిల్లా ప్రజలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 15-16 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. దీనికి తోడు మంచు కూడా కురుస్తోంది. ఈనెల 11 నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16-17 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు. చలిని తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు.

News December 10, 2025

అల్లూరి జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

image

జిల్లా వ్యాప్తంగా వాహన ప్రమాదాల నివారణకు గత వారం రోజులుగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించామని జిల్లా ఏఎంవీఐ సాయి రమేశ్ మంగళవారం తెలిపారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 12 జీపులకు రూ.80,330 చలానా విధించామన్నారు. అధిక ధరలు, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని మూడు జీపులను సీజ్ చేసి ఆర్టీసీ డిపోకు తరలించామన్నారు.