News April 3, 2025

KMR: పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

image

మద్నూర్‌లో నిషేధిత అల్ఫాజోలం పట్టుబడ్డ కేసులో ఇది వరకే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ పత్రికలో పని చేసే మరో వ్యక్తి పైయ్యర్ల శ్రీనివాస్ పరారీలో ఉండగా బుధవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News January 11, 2026

సంక్రాంతికి విశాఖ-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖ, విజయవాడ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు DRM లలిత్ బోహ్ర ఆదివారం తెలిపారు. విశాఖ – విజయవాడ జన సాధారణ రైలు (08567/68) జనవరి 12,13,14, 16,17,18 తేదీలలో నడవనుంచి. విశాఖలో ఉదయం 10.08 గంటలకు బయలుదేరి విజయవాడ సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

News January 11, 2026

పెరవలి: ఆ రోజులే మళ్లీ రప్పించాయి

image

పెరవలి మండలంలోని కానూరు శ్రీ అక్కిన చంద్రయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2005-2006 టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 ఏళ్లకు తరువాత కలుసుకుని అప్పటి మధుర జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు.

News January 11, 2026

మెదక్: వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు 2490 దుప్పట్లను జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కలెక్టర్‌కు అందజేశారు. దుప్పట్లను 17 బీసీ, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 1556 మంది విద్యార్థులకు, 6 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో 932 మంది విద్యార్థులకు అందజేశారు. గొప్పగా స్పందించి, పెద్ద ఎత్తున దుప్పట్లు అందించిన వారికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.