News April 3, 2025

జనగామ: కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఆర్టీఏ నెంబర్

image

జనగామకి చెందిన చిలువేరి అభి గౌడ్ జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీసీపీ మహేంద్ర నాయక్, సీఐ దామోదర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం తరఫున, రవాణా శాఖకు సంబంధించి అన్ని రకాలుగా అవగాహన కల్పించడంతో పాటు అందరూ బాధ్యతాయుతంగా ఉండేలా చేసుకోవాలని అధికారులు వారికి సూచించారు.

Similar News

News November 2, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా వీస్తున్న గాలులకు రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. ఇవాళ బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA తెలిపింది. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. TGలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్లు HYD IMD పేర్కొంది.

News November 2, 2025

సిద్దిపేట: వైన్స్ షాపుల అనధికారిక వేలం!

image

రెండు రోజుల క్రితం మద్యం దుకాణాల టెండర్లు పూర్తయ్యాయి. దుకాణాలు పొందిన వారికి అదృష్టం వరించిందని అందరు అనుకున్నారు. నిజమే వారికి అదృష్టం వరించింది. అధికారిక టెండర్లు పూర్తవ్వగానే ఇప్పడు అనధికారంగా వేలం పాటలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న వారు ఆ దుకాణాలను కోట్లలో విక్రయించడానికి తెర తీశారని అంటున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూద్దాం.

News November 2, 2025

అమరావతి మార్క్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక

image

నవంబర్ 26న రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించనున్న మార్క్ అసెంబ్లీకి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి పోటీల్లో ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులు పాల్గొంటారని MEOలు త్యాగరాజు, నాగ సుబ్రాయుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ తెలిపారు. PTM మండలం, రంగసముద్రం ZP స్కూల్ విద్యార్థి పవన్ సాయి, తంబళ్లపల్లె మోడల్ స్కూల్ విద్యార్థిని సుహాన, బి కొత్తకోట ZP విద్యార్థి అనిల్ కుమార్ ఎంపికయ్యారన్నారు.