News April 3, 2025

NGKL: అమ్మాయిలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా.. జాగ్రత్త..!

image

మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో షీ టీం పనిచేస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Similar News

News April 10, 2025

ADB: గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

image

గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మనోహర్ కు వచ్చిన సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తులు ఓ బైక్ పైన వారిని తనిఖీ చేయగా వారి వద్ద సుమారు కిలోకు పైగా గంజాయి లభించింది. అదిలాబాద్ రూరల్ మండలం అసోద గ్రామంలో గంజాయి ఇచ్చిన కుమ్ర రాహుల్, రాయికల్ మండలనికి చెందిన మెండే అనిల్, తురగ గౌతంలను అదుపులోకి తీసుకున్నారు.

News April 10, 2025

ALERT: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..?

image

బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారికి నిబంధనల్ని మరింత కఠినం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఎంత రుణం జారీ చేయాలన్నదాని నుంచి తీసుకున్న నగదును ఎలా వినియోగించాలి, రుణం తీర్చని బంగారాన్ని సంస్థలు ఎలా వేలం వేయాలి అన్న అంశాల వరకు అనేక అంశాలపై RBI విధివిధానాల్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ప్రకటన అనంతరం ముత్తూట్, IIFL, మణప్పురం, చోళమండలం సంస్థల షేర్లు పతనమయ్యాయి.

News April 10, 2025

లోకేశ్వరం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలం రాజురలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పతాని నడ్పి మల్లన్న( 62) తన పంట చేనులో నీటికోసం దాదాపు 20 బోర్లను వేయించగా నీరు పడక పంటలు ఎండిపోయాయి. చేసిన అప్పులు భారంగా మారడంతో రైతు తన పంట చేనులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమన్నారు.

error: Content is protected !!