News April 3, 2025
HYD: పాత కూలర్లు, ఫ్రిడ్జ్, కుర్చీల కోసం ఇక్కడికి రండి!

పాత కూలర్లు, ఫ్రిడ్జ్, కుర్చీలు, CPU, కంప్యూటర్లు, బ్యాటరీలు తక్కువ ధరకు కొనాలనుకున్నవారు HYD అంబర్పేట్ పరేడ్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్కు రావాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలపారు. ఏప్రిల్ 4న ఉదయం 10:30 గంటలకు జరిగే వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.
Similar News
News April 10, 2025
రాజీవ్ యువ వికాసానికి 9.5 లక్షల దరఖాస్తులు

TG: నిరుద్యోగుల ఉపాధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే 9.5 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ నెల 14న తుదిగడువు కాగా ఆలోపు దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు.
News April 10, 2025
కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య పోరాటం చేస్తోంది: ఖర్గే

అహ్మదాబాద్లో ముగిసిన ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఏదో రోజు దేశాన్ని అమ్మేస్తారు. భారత సంపదను తన మిత్రులకు ధారపోస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేస్తోంది. ఎన్నికల్లోనూ ఈవీఎంల సాయంతో పచ్చిగా మోసాలకు పాల్పడుతోంది. అందుకే 90శాతం సీట్లు గెలిచారు’ అని ఆయన ఆరోపించారు.
News April 10, 2025
గుంతకల్లు: రైల్వే అభివృద్ధి పనులపై సమీక్ష

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ఎస్ఆర్సి కమిటీ సభ్యులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని హనుమాన్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జి, కసాపురం రోడ్డులోని రైల్వే బ్రిడ్జి ఎత్తు పెంచే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే తెలిపారు.