News March 26, 2024

నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోరా?

image

లద్దాక్‌లో ప్రముఖ ఇంజినీర్, సంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 21వ రోజుకు చేరింది. వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో హక్కుల కోసం స్థానికులు పోరాడుతున్నా కేంద్రం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించినట్టు నేడు ఆయన దీక్ష విరమించే అవకాశం ఉంది. వాంగ్‌చుక్ స్థానంలో స్థానికులు విడతల వారీగా దీక్ష చేపట్టనున్నారు. ఆయన కోలుకున్నాక మళ్లీ నిరాహార దీక్ష చేపట్టే అవకాశం ఉంది.

Similar News

News October 3, 2024

PM- RKVY స్కీమ్‌కు రూ.లక్ష కోట్ల మంజూరు

image

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్‌కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2‌కు ఆమోదం తెలిపింది.

News October 3, 2024

‘వైవాహిక అత్యాచారం’ పిటిషన్లను వ్యతిరేకించిన కేంద్రం

image

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలకు ‘అత్యాచారాన్ని’ మినహాయించే ప్రస్తుత ఉన్న చట్టాలను సమర్థించింది. వివాహిత అత్యాచారం అనేది చట్టబద్ధమైన సమస్య కంటే సామాజిక ఆందోళన అని, ఈ విష‌యంలో నిర్ణయం తీసుకొనే ముందు విస్తృత చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంద‌ని పేర్కొంది. వివాహాన్ని సమాన బాధ్యతలు కలిగిన బంధంగా పరిగణిస్తారంది.

News October 3, 2024

రైల్వే ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త‌

image

రైల్వే ఉద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. 78 రోజుల బోన‌స్ ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం రైల్వే శాఖ‌లో ప‌నిచేస్తున్న సుమారు 11.72 ల‌క్ష‌ల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల‌కు ప‌నితీరు ఆధారిత (Productivity Linked Bonus) బోన‌స్‌ ల‌భించ‌నుంది. అర్హత ఉన్న ప్ర‌తి రైల్వే ఉద్యోగికి 78 రోజులకుగానూ గ‌రిష్ఠంగా రూ.17,951 చెల్లించ‌నున్నారు.