News April 3, 2025
VKB: పెద్దేముల్లో మిస్టరీగా మహిళ మృతి!

పెద్దేముల్ మండల కేంద్రంలోని కోట్పల్లి ప్రాజెక్టు కాలువలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. సదరు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. DSP బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందం వివరాలు సేకరించారు. మహిళ ముఖం, చేతిని కాల్చివేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Similar News
News November 17, 2025
టెరిటోరియల్ ఆర్మీలోకి మహిళలు!

టెరిటోరియల్ ఆర్మీలోకి మహిళలను చేర్చుకునే అంశాన్ని ఆర్మీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని బెటాలియన్లలో నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఇతర బెటాలియన్లలోనూ నియమించుకునే అవకాశం ఉంది. ఆర్మ్డ్ ఫోర్సెస్లో నారీ శక్తి పెరగాలన్న ప్రభుత్వ ప్రయత్నాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులు పడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
News November 17, 2025
నేడు నక్తం పాటిస్తున్నారా?

ఈ పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారానికి చాలా విశిష్టత ఉంది. గత సోమావారాల్లో ఆచరించని విధులను నేడు ఆచరిస్తే అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. శివ భక్తులు ముఖ్యంగా నేడు ‘నక్తం’ దీక్షను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు. నక్తం అంటే.. పగలు ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయడం. ఈ దీక్షతో శివానుగ్రహంతో అఖండ పుణ్యం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.
News November 17, 2025
నేడు నితీశ్ రాజీనామా.. 20న ప్రమాణం?

బిహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా CM నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 20న ఆయన తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మొత్తం 32 మందితో కొత్త క్యాబినెట్ కొలువుదీరనుందని, బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. స్పీకర్గా బీజేపీ సభ్యుడినే నియమిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పాయి.


