News April 3, 2025

మరో దోపిడీకి తెరలేపిన రేవంత్ సర్కార్: KTR

image

TG: కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తుకాగితంతో సమానమని సీఎం రేవంత్ మరోసారి నిరూపించారని KTR దుయ్యబట్టారు. ఉచిత LRS అని మభ్యపెట్టి అధికారంలోకి రాగానే రూ.1,400 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఖజానా నింపుకునేందుకు గడుపు పెంచి మరో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. హామీని మరచి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న CONG సర్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 17, 2025

IPL: నేడు ముంబైతో హైదరాబాద్ ఢీ

image

ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రా.7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 23 మ్యాచుల్లో తలపడగా MI 13, SRH 10 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో MI ఏడో స్థానంలో, SRH తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లు తమ చివరి మ్యాచులో విజయాన్ని సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాయి. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.

News April 17, 2025

హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

image

TG: హైదరాబాద్‌లో 26 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 10,647 యూనిట్ల హౌస్ సేల్స్ జరిగినట్లు వెల్లడించింది. అదే గతేడాది ఇదే వ్యవధిలో 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం సేల్స్ పెరిగినట్లు వివరించింది.

News April 17, 2025

నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

image

TG: ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.

error: Content is protected !!