News April 3, 2025
ఆసిఫాబాద్: KU.. గడువు మరోసారి పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News September 17, 2025
పలు శాఖల పనితీరుపై సీఎం ఆగ్రహం

AP: హోం, మున్సిపల్, రెవెన్యూ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు తేల్చాయని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. హోంశాఖ, మున్సిపల్ శాఖలు సరిగా పనిచేయడం లేదని తనకు ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. అన్నిశాఖల మంత్రులు, అధికారులు ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 17, 2025
GNT: మణికంఠ హత్యకేసులో ముద్దాయిల అరెస్ట్

గుంటూరు సంగడిగుంటలో మణికంఠ(27)పై దాడిచేసి అతని మరణానికి కారణమైన 11 మంది నిందితులను లాలాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చుట్టుగుంటకు చెందిన యర్రం యశ్వంత్కి, మణికంఠతో పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో యశ్వంత్ ఈ నెల 8న మణికంఠతో గొడవపెట్టుకొని అతని స్నేహితులతో కలిసి దాడి చేయగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి హనుమంతరావు ఫిర్యాదుమేరకు నిందితులను అరెస్ట్ చేశారు.
News September 17, 2025
వరిధాన్యం రవాణాకు సహకరించండి: DTO

ఖరీఫ్ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు సహకరించాలని లారీ, ట్రాక్టర్ యజమానులకు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సమీప రైతు సహాయక కేంద్రాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సహకరించిన వాహన యజమానులకు రవాణా ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.