News April 3, 2025
మారికవలసలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మధురవాడలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన బలగ ప్రభాకర్ (50) మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తుండగా.. మారికవలస నేషనల్ హైవేపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక సీటులో కూర్చున్న ప్రభాకర్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు.
Similar News
News April 10, 2025
దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్ప్రెస్

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు.
News April 10, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో బుధవారం రెవెన్యూ వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ పరమైన అన్ని అంశాలపై, ప్రభుత్వ జీవోలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు.
News April 9, 2025
విశాఖలో రేపు మాంసం దుకాణాలకు సెలవు

మహావీర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ పరిధిలో గురువారం మాంసం దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ నగర పశు నియంత్రణాధికారి డాక్టర్ ఎన్.కిషోర్ బుధవారం తెలిపారు. కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు రేపు జంతువధ, మాంస విక్రయాలు నిషేధం అన్నారు. ఈ నింబదనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.