News April 3, 2025
HCU విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తాం: భట్టి

TG: HCUకు సంబంధించిన భూమిని ఇంచుకూడా ప్రభుత్వం తీసుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఢిల్లీలో తెలిపారు. వారిపై దుందుడుకుగా వ్యవహరించవద్దని పోలీసులను ఆదేశించారు. గతంలో బిల్లీరావుకు చంద్రబాబు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెడితే నాటి సీఎం వైఎస్సార్ ఆ భూములను కాపాడారని చెప్పారు.
Similar News
News January 22, 2026
కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు: విజయసాయి

AP: మాజీ MP విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. కూటమిని విడగొడితేనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఏపీ మద్యం స్కామ్ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని కేసుల్లో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
News January 22, 2026
అవును.. ప్రేమలో ఉన్నా: ఫరియా అబ్దుల్లా

తాను ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ అబ్బాయి హిందువా ముస్లిమా అని యాంకర్ అడగగా హిందువేనని బదులిచ్చారు. లవ్ వల్ల తన లైఫ్లో బ్యాలెన్స్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తాను, తన బాయ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్స్ కాదని, అతడు డాన్స్ బ్యాక్ గ్రౌండ్కు చెందిన వ్యక్తి అని తెలిపారు. తాను ర్యాప్, డాన్స్లో రాణించడానికి అతడి సపోర్టే కారణమని చెప్పారు.
News January 22, 2026
అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?: కిషన్ రెడ్డి

TG: గతంలో BRS, ఇప్పుడు INC పాలనలో సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కొందరు CBI దర్యాప్తు కోరుతున్నారు. కానీ రాష్ట్ర అంశాలను CBI దర్యాప్తు చేయకూడదని గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?’ అని ప్రశ్నించారు. కోల్ బ్లాక్స్ వేలం నిర్వహణకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.


