News April 3, 2025
కొత్త జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహా వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ వేడుకలో జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News April 10, 2025
వెల్దుర్తి: క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తే.. ఏమైందో చూడండి.!

వెల్దుర్తిలో తహశీల్దార్ కార్యాలయంలో వింత ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కృష్ణ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం బుధవారం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అధికారులు నీకు ఎస్సీ కుల ధ్రువీకరణ నమోదు జాబితాలో లేదని చెప్పారన్నారు. చిన్నప్పటి నుంచి పీజీ వరకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం ఉందని, కానీ ఈ సం,, కుల ధ్రువీకరణ పత్రం తొలగించారని వాపోయారు. ఈ తప్పిదంతో ఎస్సీ కార్పొరేషన్ కోల్పోతానని వెల్లడించాడు.
News April 10, 2025
నేడు కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ కానున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా.. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, MLCలు, MLAలు, మాజీ MPలు, మాజీ MLAలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
News April 10, 2025
కర్నూలుతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా హౌసింగ్, పిజిఆర్ఎస్, పీఆర్ వన్ యాప్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాగునీరు, రీసర్వే, ఐవిఆర్ఎస్ వంటి అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు పరిశీలించి, అధికారులకు నిబంధనలు, ఆదేశాలు జారీ చేశారు.