News April 3, 2025
లక్షణాలు లేకపోయినా ఆస్పత్రి పాలు.. ఓ కంపెనీ CEO పోస్ట్ వైరల్!

ఆస్పత్రిపాలైన ‘డేజీన్ఫో మీడియా’ సీఈవో అమిత్ మిశ్రా చేసిన లింక్డిన్ పోస్ట్ వైరలవుతోంది. ‘ఆఫీస్ వర్క్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా బీపీ 230 దాటింది. డాక్టర్లు తీవ్రంగా శ్రమించి BP తగ్గిస్తే మరుసటి రోజు మూర్చపోయా. ఎలాంటి లక్షణాలు లేవు. ఈ అనుభవంతో చెప్తున్నా పని ముఖ్యమే కానీ ఆరోగ్యమూ చూసుకోండి. అందుకే తరచుగా హెల్త్ చెకప్స్ చాలా ముఖ్యం’ అని ఆయన రాసుకొచ్చారు.
Similar News
News April 10, 2025
‘రామాయణం’లో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణం’ చిత్రంలో హనుమంతుడిగా నటిస్తున్నట్లు సన్నీ డియోల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అవును నేను హనుమంతుడి పాత్ర చేస్తున్నా. నటులుగా మేము సవాళ్లతో కూడిన పాత్రలను ఇష్టపడతాం. ఎందుకంటే అది సరదాగా ఉంటుంది. ప్రజలు మెచ్చేలా నేను ఆ పాత్రలో లీనమైపోతా. నేను ఇంకా షూటింగ్లో పాల్గొనలేదు. ఇది ఆల్ టైమ్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని ఆయన తెలిపారు.
News April 10, 2025
ALERT: రెండ్రోజుల పాటు వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. గంటకు 50 కి.మీ వేగం వరకూ ఈదురుగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
News April 10, 2025
ESICలో 558 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్-ఢిల్లీలో 558 స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో MS/MD/MCH/DM/MSC చేసిన వారు అర్హులు. వయసు 45ఏళ్లు మించరాదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రారంభ జీతం సీనియర్ స్కేల్కు నెలకు రూ.78,800, జూనియర్ స్కేల్కు రూ.67,700 ఉంటుంది.
వెబ్సైట్: https://www.esic.gov.in/