News April 3, 2025
వారసత్వ సంపద గల నగరం మచిలీపట్నం: కలెక్టర్

మచిలీపట్నం నగరం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరు కోటను పర్యాటక సర్క్యూట్లో చేర్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరు కోట, డచ్ సమాధులను కలెక్టర్ పరిశీలించారు. తొలుత బందరుకోటను సందర్శించి చుట్టూ కలియ తిరిగారు.
Similar News
News April 10, 2025
కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి

గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వడ్డెర కుటుంబానికి చెందిన లక్ష్మి(45) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం కేసరపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
News April 10, 2025
కృష్ణా: నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు- కలెక్టర్

కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ నెలకొల్పుటకు అనువైన స్థలాలను గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ MSME పార్కుల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.
News April 10, 2025
కృష్ణా : ముగిసిన ‘పది’ మూల్యాంకణం

మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకణ బుధవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన మూల్యాంకణ ప్రారంభమవ్వగా మొత్తం 1,89,852 సమాధాన పత్రాలను మూల్యాంకణ చేశారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు మూల్యాంకణ విధుల్లో పాల్గొన్నారు.