News April 3, 2025

జనగాం యువతకు కలెక్టర్ సూచనలు

image

యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగించుకోవాలన  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రంలో అందజేయాలన్నారు.

Similar News

News April 10, 2025

నేడు తోబుట్టువుల దినోత్సవం.. మీకున్నారా?

image

సంతోషం, బాధల్లో కుటుంబం ఒక్కటే తోడుంటుంది. ముఖ్యంగా తోబుట్టువులు మనకు అండగా నిలుస్తుంటారు. వారితో మనకుండే అనుభూతులు వెలకట్టలేనివి. ఏజ్ గ్యాప్ తక్కువగా ఉండటంతో వారి బట్టలు వేసుకోవడం, వారి పుస్తకాలను వాడుకోవడం, ఎవరి దగ్గర డబ్బులున్నా అంతా పంచుకోవడం వంటి జ్ఞాపకాలు మరువలేనివి. కానీ అప్పటి బంధాలు ఇప్పుడు కరువయ్యాయి. ఈర్ష్య పెరిగిపోయి ఒకరికొకరు సాయం చేసుకోవట్లేదు. ఇకనైన కలిసి ఉండేందుకు ప్రయత్నించండి.

News April 10, 2025

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు నమోదు

image

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టడం, హెలిపాడ్ చుట్టూ బారికేడ్ల ఏర్పాటులో తోపుదుర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

News April 10, 2025

భారత్‌కు రాణా.. స్పందించిన పాక్

image

ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా భారత్‌కు తీసుకురావడంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ‘అతడు కెనడియన్ పౌరసత్వం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి రాణా తన పాక్ డాక్యుమెంట్ల రెన్యూవల్‌కు దరఖాస్తు చేయలేదు. అతడి విషయంలో తగిన సమయంలో మళ్లీ స్పందిస్తాం’ అని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా ముంబై తాజ్ హోటల్‌లో ఉగ్రదాడిలో 166 మంది మరణించారు.

error: Content is protected !!