News April 3, 2025

గుంటూరు: వృద్ధురాలిపై కర్రలతో దాడి.. మృతి

image

గుంటూరు నగరంలోని ఆనందపేటలో రెండు వర్గాల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. పాత కక్షల నేపథ్యంలో హర్షద్ కుటుంబ సభ్యులపై ఫిరోజ్, ఫరోజ్‌తో పాటు మరికొందరు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ ఖాజాబీ(75) మరణించింది. హర్షద్ తల్లిదండ్రులు షాజహాన్, బాబులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

Similar News

News April 10, 2025

GNT: సోషల్ మీడియా దుర్వినియోగానికి గట్టి హెచ్చరిక 

image

చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను TDP ఆయనను తక్షణమే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా పార్టీ నైతిక ప్రమాణాలను ప్రదర్శించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఆచరణా నియమాలను ఉల్లంఘించే వారికి హెచ్చరికగా నిలిచింది. పార్టీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. CM చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని పలువురు అంటున్నారు. 

News April 10, 2025

డాక్టర్ ప్రభావతి వ్యాఖ్యలపై RRR స్పందన

image

కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి తనకేమీ గుర్తులేదని చెప్పడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ చదివిన వైద్యురాలు గాయాలపై అవగాహన లేదనడం ఆశ్చర్యకరమని అన్నారు. ఆమెకు గతం గుర్తొచ్చే ఏర్పాట్లు జరుగుతాయని ఆశిస్తున్నానన్నారు. కొన్ని సినిమాల్లోలా, ఆమెకి మళ్లీ జ్ఞాపకశక్తి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

News April 10, 2025

గుంటూరు: అలర్ట్.. ఏప్రిల్ 30 వరకే గడువు 

image

గుంటూరు జిల్లాలో రేషన్ కార్డు ఉన్నవారు ఈనెల 30లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. రేషన్ డీలర్ లేదా ఎండీయూ వాహనం వద్ద పోస్ మెషిన్‌లో మీ వివరాలు తెలుసుకోవచ్చు. ఎర్ర రంగులో పేరు ఉంటే ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లు. వెంటనే వేలిముద్ర వేసి పూర్తిచేయండి. ఐదేళ్లలోపు, 80ఏళ్లు పైబడిన వారికి ఇది వర్తించదు. గడువులోగా పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం epds1 వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. 

error: Content is protected !!