News April 3, 2025

కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి

image

కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో రవి(15) పొలం పనులు చేస్తున్నాడు. మెరుపులతో బాలుడి సమీపంలో పిడుగు పడింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు పొలంలో పనిచేస్తున్న పలువురికి గాయాలు కాగా వారిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Similar News

News April 13, 2025

 కర్నూలు: KGBV విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డులు

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో కేజీబీవీలలో విద్యార్థులకు ప్రభుత్వం సన్ షైన్ స్టార్ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు చెందిన పంచలింగాలకు చెందిన కేజీబీవీ పాఠశాల విద్యార్థిని మానస, కేజీబీవీ ఓర్వకల్లుకు చెందిన హరిత, గూడూరు కేజీబీవీ చెందిన సునీతలు ఎంపికయ్యారు. వారికి ఈనెల 15వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

News April 13, 2025

కర్నూలు: పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం రద్దు

image

డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించాలన్నారు.

News April 13, 2025

క్యాన్సర్‌ను జయిస్తూ 420 మార్కులతో ప్రతిభ 

image

బ్లడ్ క్యాన్సర్‌ బారిన పడి కోలుకుంటున్న కర్నూలు జిల్లా విద్యార్థిని ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. గోనెగండ్లకు చెందిన సృజనామృత బైపీసీలో 440కు గానూ 420 మార్కులతో ప్రతిభ చూపారు. కర్నూలులోని ఓ కళాశాలలో చదువుతన్న బాలిక క్యాన్సర్‌ను జయిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించండంపై అధ్యాపకులు అభినందించారు. తండ్రి ఉరుకుందు గౌడ్ ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని బాలిక తెలిపారు.

error: Content is protected !!