News April 3, 2025
కొడంగల్: పిడుగుపాటుతో గొర్రెలు, మేకలు మృతి

కొడంగల్ మండలం ఖాజా అహ్మద్పల్లి గ్రామంలో పిడుగు పాటుతో గొర్రెలు, మేకలు మృతి చెందాయి. పకీరప్ప రోజు మాదిరిగా జీవాలను మేతకు వెళ్లారు. అకాల వర్షం నేపథ్యంలో దాదాపు 30 మేకలు, గొర్రెలు చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడింది. దీంతో 25 జీవాలు మృతిచెందగా దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన పకీరప్ప కోరుతున్నారు.
Similar News
News November 14, 2025
విశాఖలో నేటి నుంచే CII సమ్మిట్

నేటి నుంచి జరుగనున్న CII సమ్మిట్కు AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖులు నగరానికి చేరుకున్నారు. 2 రోజుల సమ్మిట్ను ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. తొలిరోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను CM చంద్రబాబు వర్చువల్గా ప్రారంభిస్తారు. అనంతరం 25 సెషన్లలో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో AP గవర్నర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.
News November 14, 2025
GNT: చిల్డ్రన్స్ డే.. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి.!

స్కూల్లో జరిగే చిల్డ్రెన్స్ డే వేడుకలు అంటే మనలో చాలామందికి పాత జ్ఞాపకాలు మెదులుతాయి. విద్యార్థులు తెల్లపైజామా, జాకెట్, గులాబీతో నెహ్రూ గెటప్లో హాజరయ్యేవారు. డ్రాయింగ్, స్పోర్ట్స్, క్విజ్ పోటీలు వంటి ఆటలలో గెలిచిన వారికి బహుమతుల ప్రదానం అనంతరం ఆటలు, సంగీత కార్యక్రమాలు చాక్లెట్ల పంపిణీతో మొత్తం రోజు ఆనందంగా గడిచేది. బాలల దినోత్సవంపై మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో COMMENT చేయండి.
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: అభ్యర్థి మృతి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒకరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు.


