News April 3, 2025
కంబోడియాలో అనంతపురం యువకుడి ప్రతిభ

మార్చి 28, 29, 30న కంబోడియా దేశంలో నిర్వహించిన మొట్టమొదటి ఆసియా పారా త్రో బాల్ జట్టులో అనంతపురం యువకుడు ప్రతిభ చాటారు. జిల్లాకు చెందిన వెన్నపూస రోషి రెడ్డి భారత త్రో బాల్ జట్టుకు ఎంపికై రజత పతకం సాధించినట్లు క్రీడా అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ తెలిపారు. భారత్ Vs మలేషియా పారా త్రోబాల్ జట్టు తలపడ్డాయని పేర్కొన్నారు. మొదటి 3 రౌండ్లలో భారత త్రోబాల్ జట్టు విజయం సాధించిందన్నారు.
Similar News
News April 10, 2025
నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ: ఎస్పీ జగదీష్

అనంత జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ జగదీష్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO& రేప్ కేసులు, ప్రాపర్టీ, దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ & ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, 174 Cr.P.C కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెండింగ్ NBWs, NDPS కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి చర్చించారు.
News April 10, 2025
తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు నమోదు

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జగన్ పర్యటన వేళ వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టడం, హెలిపాడ్ చుట్టూ బారికేడ్ల ఏర్పాటులో తోపుదుర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
News April 10, 2025
వైఎస్ జగన్ రామగిరి పర్యటన.. కేసు నమోదు

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనపై కేసు నమోదైంది. వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లగా అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఆర్ హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.