News April 3, 2025

ఎల్లుండి విద్యార్థుల తల్లిదండ్రుల మహా ధర్నా!

image

CBSE పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో ధర్నా చౌక్ వద్ద ఎల్లుండి మహా ధర్నా చేపట్టనున్నారు. ‘ఈ నిర్ణయంతో బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. దశలవారీగా తెలుగును మూడో భాషగా ప్రవేశపెట్టాలి. సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి’ అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News September 12, 2025

త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

image

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్‌తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

News September 12, 2025

SBIలో 122 ఉద్యోగాలు

image

SBI 122 పోస్టుల భర్తీకి <>అప్లికేషన్లు<<>> స్వీకరిస్తోంది. ఇందులో మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్, ప్రొడక్ట్స్-డిజిటల్ ప్లాట్ ఫామ్స్) పోస్టులు 97, డిప్యూటీ మేనేజర్ పోస్టులు 25 ఉన్నాయి. డిగ్రీ లేదా MBA/PGDBA/PGDBM/MMS/CA/CFA/ICWA, B.E/B.Tech/MCA పాసవడంతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు అర్హులు. జీతం మేనేజర్‌కు నెలకు ₹85K-1.05L, డిప్యూటీ మేనేజర్‌కు ₹64K-93K ఉంటుంది. దరఖాస్తుకు లాస్ట్ డేట్: OCT 2.

News September 12, 2025

లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్.. త్వరలో కొత్త రూల్?

image

లోన్‌పై కొనుగోలు చేసిన ఫోన్ల విషయంలో RBI కొత్త రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సకాలంలో లోన్ చెల్లించకపోతే ఫోన్లను రిమోట్‌ విధానంలో లాక్ చేసేలా రుణదాతలకు RBI అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ‘దీనికి యూజర్ల ముందస్తు అనుమతి, డేటా ప్రొటెక్షన్‌ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందించనుంది. ఫోన్ లాక్ అయ్యేందుకు అందులో ముందే ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు’ అని పేర్కొంది.