News April 3, 2025
VKB: భారీ వర్షాలు.. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున జిల్లా కలెక్టరేట్లో 08416242136 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో వర్షాలు పడుతున్నందున ఎక్కడైనా సమస్య ఏర్పడితే కంట్రోల్ రూమ్కు కాల్ చేస్తే సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News April 10, 2025
ఆపేరల్ పార్కులో మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సిరిసిల్ల అపెరల్ పార్క్లోని టెక్స్ పోర్ట్ యూనిట్ను రేపు మంత్రులు ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
News April 10, 2025
నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ: ఎస్పీ జగదీష్

అనంత జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ జగదీష్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO& రేప్ కేసులు, ప్రాపర్టీ, దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ & ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, 174 Cr.P.C కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెండింగ్ NBWs, NDPS కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి చర్చించారు.
News April 10, 2025
ఈ ఐదు ఆహారాలను వేడి చేసి తినకండి!

ఆహారాన్ని పలుమార్లు వేడి చేసి తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డను వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతాయి. పాలకూరలో ఉండే నైట్రేట్లు, అమినో యాసిడ్తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు. మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండె జబ్బులొస్తాయి. కోడిగుడ్డు కూడా తాజాగానే తినాలి. టీని కూడా మళ్లీ వేడి చేసి తాగొద్దు. SHARE IT