News April 3, 2025
మరో వివాదంలో నిత్యానంద!

సజీవ సమాధి అయ్యారంటూ వార్తల్లో నిలిచిన <<15965534>>నిత్యానంద<<>> మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈక్వెడార్ సమీపంలో ‘కైలాస’ దేశం ఏర్పాటుచేసుకున్న ఆయన కన్ను బొలీవియాపై పడినట్లు సమాచారం. నిత్యానంద అనుచరులు 20మంది $2లక్షలకు ఓ ప్రాంతాన్ని 25ఏళ్ల లీజుకు తీసుకునేందుకు స్థానిక తెగలతో డీల్ చేసుకున్నారు. వెయ్యేళ్ల లీజుకు ప్రయత్నించగా విషయం బయటికొచ్చింది. దీంతో GOVT వారిని అరెస్ట్ చేసి సొంత దేశాలకు(IND, చైనా, US) పంపింది.
Similar News
News September 12, 2025
త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
SBIలో 122 ఉద్యోగాలు

SBI 122 పోస్టుల భర్తీకి <
News September 12, 2025
లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్.. త్వరలో కొత్త రూల్?

లోన్పై కొనుగోలు చేసిన ఫోన్ల విషయంలో RBI కొత్త రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సకాలంలో లోన్ చెల్లించకపోతే ఫోన్లను రిమోట్ విధానంలో లాక్ చేసేలా రుణదాతలకు RBI అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ‘దీనికి యూజర్ల ముందస్తు అనుమతి, డేటా ప్రొటెక్షన్ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందించనుంది. ఫోన్ లాక్ అయ్యేందుకు అందులో ముందే ఓ యాప్ను ఇన్స్టాల్ చేస్తారు’ అని పేర్కొంది.