News April 3, 2025
మహబూబ్నగర్, మక్తల్లో కొత్త బార్ల కోసం నోటిఫికేషన్

పాలమూరు పరిధి మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల్లో కొత్త బార్ల కోసం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుదారుడు రూ.లక్ష నాన్ రిఫండబుల్ ఫారం-A ద్వారా దరఖాస్తులు నింపి జిల్లా మద్య నిషేధ & ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో మహబూబ్నగర్ లేదా హైదరాబాద్లో ఏప్రిల్ 26లోపు సమర్పించాలన్నారు. https://tgbcl.telangana.gov.in వెబ్సైట్ చూడాలన్నారు.
Similar News
News September 18, 2025
రాజమండ్రి: నూతన కలెక్టర్ను కలిసిన జిల్లా ఎస్పీ

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.
News September 18, 2025
బతుకమ్మ వేడుకలు.. దద్దరిల్లనున్న ట్రై సిటీ!

బతుకమ్మ వేడుకలకు వరంగల్ ట్రై సిటీ సిద్ధమవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి, పద్మాక్షమ్మ గుట్ట, ఉర్సు రంగలీలా మైదానం, చిన్న వడ్డేపల్లి చెరువు, శివనగర్ గ్రౌండ్, మెట్టుగుట్ట, మడికొండ చెరువు, బెస్తం చెరువు, తోట మైదానం, డబ్బాల్ హనుమాన్ గుడి, బంధం చెరువు, కాశిబుగ్గ శివాలయం, కట్టమల్లన్న చెరువు వద్ద వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటిలో మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News September 18, 2025
ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం ఎప్పుడో?

కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియ ఆస్పత్రిని 2015లో పరిశీలించి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆస్పత్రికి త్వరలో నూతన భవన నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉస్మానియాకు పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. అప్పటినుంచీ ఇప్పటి వరకు నాయకులు ప్రకటించడమే గానీ వైభవం తెచ్చేలా ఎవరూ పనిచేయడం లేదు. ఇలా ఉంది మన పాలకుల తీరని ప్రజలు చర్చించుకుంటున్నారు.