News April 3, 2025

ప్రతి మండల కేంద్రం వాలీబాల్ కోర్టు: కలెక్టర్

image

ప్రతి మండల కేంద్రంలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాస్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తి చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి జాహ్నవి పాల్గొన్నారు.

Similar News

News April 11, 2025

నేడే డయల్ యువర్ డీఎంలో పాల్గొనండి: జనగామ డీఎం

image

జనగామ ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం ఉ.10 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నామని డీఎం స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ సమస్యలతో పాటు సూచనలు సలహాలకు 9959226050 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News April 11, 2025

జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయాడని సృష్టించి భూమి పట్టా

image

వ్యక్తి బతికుండగానే చనిపోయాడని కాగితాలు సృష్టించి అక్రమంగా ఓ వ్యక్తికి చెందిన భూమిని పట్టా చేసుకున్న ఘటన జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రభాకర్ ప్రకారం.. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి చెందిన 4.25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అక్రమంగా పట్టా చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు.

News April 11, 2025

విషాదం: NIT విద్యార్థి ఆత్మహత్య

image

వరంగల్ జిల్లాలోని NITలో విషాదం చోటుచేసుకుంది. సంస్థలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్ సాయి అనే విద్యార్థి స్థానిక వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం హైదరాబాద్‌ కాగా ఎన్‌ఐటీ హాస్టల్‌లోనే నివాసముంటున్నాడని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!