News April 3, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, HYD, VKB, సంగారెడ్డి, నాగర్కర్నూల్, కర్నూలు, కడప, చిత్తూరు సహా మరికొన్ని జిల్లాల్లో పడిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు, ఎల్లుండి కూడా <<15974523>>వర్షాలు <<>>కురుస్తాయన్న హెచ్చరికలతో స్కూళ్లకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని, సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా? కామెంట్ చేయండి.
Similar News
News April 11, 2025
విరాట్పై ఆర్సీబీ ఫ్యాన్స్ విమర్శలు

నిన్న రాత్రి DCతో మ్యాచ్లో RCBకి సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. డీసీ బౌలర్ స్టార్క్ వేసిన ఒక ఓవర్లోనే 30 రన్స్ వచ్చాయి. బెంగళూరు కచ్చితంగా 220 ప్లస్ స్కోర్ చేస్తుందని ఫ్యాన్స్ భావించగా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో విరాట్ సాల్ట్ను రనౌట్ చేసి మంచి ఊపును దెబ్బతీశారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు విరాట్ తప్పులేదంటూ కొంతమంది కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.
News April 11, 2025
BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్ను విధిస్తున్నట్లు తెలిపింది.
News April 11, 2025
చైనాపై 145శాతానికి చేరిన అమెరికా సుంకాలు

చైనాపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 145 శాతానికి చేరాయి. వాస్తవంగా టారిఫ్ల పర్సంటేజీ 125 శాతానికి చేరింది. అయితే గతంలో ఫెంటానిల్ అక్రమ రవాణా కాకుండా విధించిన 20 శాతాన్ని అమెరికా తాజాగా గుర్తుచేసింది. దానితో కలిపి మొత్తం టారిఫ్లు 145శాతానికి చేరుకున్నాయని ట్రంప్ యంత్రాంగం వివరించింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84శాతం సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే.