News April 3, 2025

పల్నాడు జిల్లా TODAY TOP NEWS

image

☞ నరసరావుపేట: జిల్లా సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామన్న కలెక్టర్, ☞ ముప్పాళ్ల: వైసీపీ సానుభూతిపరుడిపై దాడి, ☞ రాజుపాలెం: గంజాయి అక్రమ రవాణాలో అరెస్టులు, ☞ బొల్లాపల్లి: తల్లిని హతమార్చిన తనయుడు, ☞ మాచర్ల: ఆర్టీసీ కార్మికుల ఆందోళన, ☞ నకరికల్లు: రుణ మేళాలకు 432 దరఖాస్తులు, ☞ నూజెండ్ల: బెల్టు షాపులపై కేసులు నమోదు, ☞ పెదకూరపాడు: బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ. 

Similar News

News April 11, 2025

ALERT: వచ్చే 3 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈ మూడు రోజులూ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News April 11, 2025

ADB: మట్కా నిర్వహిస్తున్న మహిళ.. నలుగురిపై కేసు:CI

image

ఆదిలాబాద్ ఖుర్షిద్ నగర్ లో మట్కా స్థావరం నిర్వహిస్తున్న వారిపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ రావు వివరాల ప్రకారం.. షేక్ నజ్జు అనే మహిళ కాలనీలో మట్కా నిర్వహిస్తుండగా.. హుస్సేన్, సాహిల్‌లు మట్కా ఆడటానికి రాగా వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మట్కా డబ్బులను షేక్ నజ్జు మరో నిర్వాహకుడు నజీమ్ ఉద్దీన్ అలియాస్ బబ్లుకు జమ చేస్తుందన్నారు. దీంతో బబ్లుపై సైతం కేసు చేశారు.

News April 11, 2025

సదాశివపేట రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్లాట్ బుకింగ్

image

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానానికి సదాశివపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎంపికైంది. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యానికి వెళ్లిన 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ విధానం కింద రాష్ట్రంలో 22 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట మాత్రమే ఎంపికైందని జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి తెలిపారు.

error: Content is protected !!