News April 3, 2025

HYD: అప్రమత్తంగా విద్యుత్‌శాఖ సిబ్బంది

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాలను విద్యుత్‌శాఖ సిబ్బంది, అధికారులు పరిశీలిస్తున్నారు. వెంట వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో కరెంటు స్తంభాలకు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.

Similar News

News September 15, 2025

రాంనగర్‌లో మృత్యు నాలాలు!

image

భారీ వర్షం వస్తే ప్రాణాలు పోతున్నాయి. వరద ఉద్ధృతికి నాలా ప్రహరీలు పేక మేడళ్ల కూలిపోతున్నాయి. ఇది ఎప్పుడో ఒకసారి అయితే ఏమో అనుకోవచ్చు. ముషీరాబాద్, రాంనగర్‌‌లో ప్రతి ఏడాది ఇదే తంతు. నిన్న వినోభానగర్‌లో యువకుడు సన్నీ గల్లంతు ఆందోళనకు దారి తీసింది. అధికారులు తూ తూ మంత్రంగా చర్యలు తీసుకొన్నారని బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియలేదని, గాలింపు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.

News September 15, 2025

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: HYD కలెక్టర్

image

వరద కారణంగా మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన వెల్లడించారు. బాడీ దొరికిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వరద ఉద్ధృతి పెరిగే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని నాళాలపై నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయని, అలాంటి నిర్మాణాలపై చర్యలు తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 15, 2025

HYD: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

image

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలపై ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 20 రోజులుగా పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది. అనంతరం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిల్లో రూ.140 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.