News April 4, 2025
KMR: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసు: SP

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరంమని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 28 బ్లాక్ స్పాట్లను ఇప్పటి వరకు గుర్తించినట్లు తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ను తప్పకుండా పాటించాలని సూచించారు.
Similar News
News January 13, 2026
‘చైనా పార్టీ’తో BJP సమావేశంపై కాంగ్రెస్ ఫైర్

సరిహద్దుల్లో చైనా షాక్స్గామ్ వ్యాలీని ఆక్రమించుకుంటూ ఉంటే.. BJP నేతలు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో ఢిల్లీలో రహస్య చర్చలు జరపడం ఏంటని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. గల్వాన్లో సైనికులు ప్రాణత్యాగం చేసినా, అరుణాచల్లో చైనా గ్రామాలు కడుతున్నా BJPకి పట్టదా? అని సుప్రియా శ్రీనేత్ ప్రశ్నించారు. అసలు ఈ బంధం వెనక ఉన్న ఒప్పందం ఏంటని ధ్వజమెత్తారు. BJP నేతలతో CCP ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు.
News January 13, 2026
అన్నమయ్య జిల్లాలో DSC ఉద్యోగాలు ఇలా..!

రాబోయే DSC నోటిఫికేషన్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70-30%తో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. 560కి పైగా పోస్టులు ఉండగా.. 30% నోటిఫికేషన్ 70% పోస్టులను పదోన్నతులతో నింపనున్నారు. ఖాళీల జాబితాను అధికారులు సిద్ధంచేస్తున్నట్టు చెప్పారు. ఈ నెలాఖరుకల్లా పూర్తి పోస్టుల జాబితా వస్తుందన్నారు. నూతన DSC ప్రకటన ఫిబ్రవరిలో వెలువడనుండగా జూన్ చివరికి నియామక ప్రక్రియ పూర్తవనుంది.
News January 13, 2026
గద్వాల: నేటి నుంచి ‘Arrive Alive’ ప్రచారం

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13 నుంచి 24 వరకు ‘Arrive Alive – A Campaign for Safer Roads in Telangana’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్బెల్ట్ ధారణపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.


