News April 4, 2025

ADB: ‘జిల్లాలో 27,432 మందికి రుణమాఫీ కాలే’

image

రుణమాఫీ కాలేక రైతు భరోసా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు స్వరాజ వేదిక జిల్లాధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. జిల్లాలో 27,432 మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. గురువారం బోథ్‌లో ఆయన మాట్లాడారు. అటు రైతు భరోసా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, రైతు భరోసా కల్పించాలని కోరారు. రైతులు రామ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 11, 2025

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయని ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జాగ్రామ్ తెలిపారు. 2025 జూన్, జూలై నెలలో నిర్వహించిన డిగ్రీ 2వ సంవత్సరం, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. https://online.braou.ac.in/UGResults/cbcsResults అనే వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.

News September 11, 2025

అంబేడ్కర్ వర్సిటీలో చేరేందుకు రేపే ఆఖరు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 12వ తేదీ వరకు గడువు ఉందని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజనులకు ఉచితంగా విద్య అందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News September 11, 2025

ADB: గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

శిశు మరణాలను తగ్గించాలంటే గర్భిణులకు సరైన పర్యవేక్షణ, ప్రసవ సమయంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం అవసరమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిల్లాలో శిశు మరణాల రేటును ఒక అంకెకు తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 15గా ఉన్న శిశు మరణాల రేటును 10 కన్నా తక్కువకు తీసుకురావడానికి వ్యూహాలను రూపొందించాలని పేర్కొన్నారు.