News April 4, 2025
కర్నూలు: ‘న్యాయవాదులకు స్టాంపుల కొరత రానివ్వం’

న్యాయవాదులకు కోర్టు స్టాంపుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో అధ్యక్ష, కార్యదర్శులుగా హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
Similar News
News April 11, 2025
కర్నూలు విద్యాశాఖ ఏడీపై సస్పెన్షన్ వేటు

కర్నూలు విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తన్నాడని ఇటీవల ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన కడప ఆర్జేడీ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. దీంతో తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
News April 11, 2025
రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. కర్నూలు జిల్లాలో 45,325 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 69 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 లో భాగంగా ఆదోని నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారం 6,7,8 నూతన ఓటర్ నమోదు, చిరునామా, మొదలగు అంశాలపై ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులతో చర్చించారు. ఎన్నికల ఉప తహశీల్దారు గాయత్రి, తదితరులు ఉన్నారు.