News April 4, 2025

అర్హులకు లోన్లు అందేలా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వెనుకబడిన తరగతుల యువతకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలతో గురువారం ఏలూరు కలెక్టరేట్ నుంచి సమీక్షించారు. బ్యాంకుల ద్వారా రుణ మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల మంజూరులో ఆటంకాలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News April 11, 2025

మేడం బిల్లు కట్టరు..కానీ విమర్శిస్తారు: మంత్రి

image

BJP ఎంపీ కంగనా రనౌత్ రెండు నెలలుగా <<16040761>>కరెంట్ <<>>బిల్లు కట్టలేదని కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. మేడం బిల్లు కట్టరు పైగా బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అల్లరి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో తాను ఇంట్లో ఉండకున్నా రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని, కాంగ్రెస్ సర్కార్ సిగ్గుపడాలని, కంగనా ఆరోపించిన సంగతి తెలిసిందే.

News April 11, 2025

SKLM: అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతీరావు ఫూలే

image

అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసి, పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి కొనియాడారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారన్నారు. సంస్కరణోద్యమంగా పేరుగాంచి కుల మత వర్ణ విబేధాలకు స్వస్తి పలికారన్నారు.

News April 11, 2025

కృష్ణా: రేపే ఇంటర్ ఫలితాలు.. ఉత్కంఠ 

image

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఉద్విగ్నత కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో 1వ సంవత్సరం 24,557, 2వ సంవత్సరం 20,873 మంది మొత్తం 45వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి. 

error: Content is protected !!