News April 4, 2025
Dy.CM పవన్తో వినుత కోట భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం శ్రీ కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత కోట మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాల, పార్టీ స్థితి గతులను ఆమె పవన్ కళ్యాణ్కు వివరించారు. అనంతరం ఆమె పవన్తో కలిసి తిరుపతి-పళని నూతన బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
VIRAL: ఓటమి బాధలో కోహ్లీ(PHOTO)

నిన్న ఢిల్లీ చేతిలో సొంతగడ్డపై ఓటమితో ఆర్సీబీ ప్లేయర్లు నైరాశ్యంలో మునిగిపోయారు. డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లీ తీవ్రమైన బాధలో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇతర చోట్ల విజయం సాధించినా సొంత గ్రౌండ్లో వరుస పరాజయాలు ఆర్సీబీ ప్లేయర్లను బాధిస్తున్నాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్న కేఎల్ రాహుల్ క్లాసీ ఇన్నింగ్సుతో బెంగళూరుకు మ్యాచును దూరం చేశారు.
News April 11, 2025
వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎంపీ కావ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వరంగల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మీడియాతో ఎంపీ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
News April 11, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ నగదు బహుమతి

మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్కు హరియాణా BJP ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. బరువు ఎక్కువున్న కారణంతో వినేశ్ ఒలింపిక్స్ ఫైనల్లో డిస్ క్వాలిఫై అవ్వగా ఆమెకు పతక విజేతలకు ఇచ్చే గౌరవాన్నే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇల్లు/ఉద్యోగం/నగదులో ఏది కావాలో ఎంచుకోవాలని సూచించగా ఆమె నగదుకే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వినేశ్కు రూ.4 కోట్ల నగదు ఇవ్వనుంది.