News April 4, 2025
Dy.CM పవన్తో వినుత కోట భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం శ్రీ కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత కోట మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాల, పార్టీ స్థితి గతులను ఆమె పవన్ కళ్యాణ్కు వివరించారు. అనంతరం ఆమె పవన్తో కలిసి తిరుపతి-పళని నూతన బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
ఖమ్మం: స్కూటీ రిపేర్ చేయలేదని షో రూమ్కు తాళం

ఖమ్మంలో గురువారం వినూత్న ఘటన జరిగింది. తన ఎలక్ట్రికల్ స్కూటీని రిపేర్ చేయలేదన్న కారణంగా ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్కు తాళం వేశాడు. బోనకల్ మండలం రావినూతలకి చెందిన కొమ్మినేని సాయి కృష్ణ నాలుగు నెలల క్రితం స్కూటీ కొనుగోలు చేశారు. రిపేరు రావడంతో షోరూమ్ సిబ్బందిని సంప్రదించగా, అది తమ పరిధిలో రిపేరు కాదని వారు తెలిపారు. దీంతో అసహనానికి గురైన సాయి కృష్ణ ఆ షోరూమ్కు తాళం వేసినట్లు సమాచారం.
News November 6, 2025
GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.
News November 6, 2025
సమగ్ర సవరణకు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సీఈవో వివేక్ యాదవ్.. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి ఆయన కాకినాడ తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు.


