News April 4, 2025
Dy.CM పవన్తో వినుత కోట భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం శ్రీ కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత కోట మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాల, పార్టీ స్థితి గతులను ఆమె పవన్ కళ్యాణ్కు వివరించారు. అనంతరం ఆమె పవన్తో కలిసి తిరుపతి-పళని నూతన బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి లాటరీ టికెట్ కొన్నాడు.. గెలవడంతో!

రాజస్థాన్లోని కోట్పూత్లీకి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా ‘పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ- 2025’లో రూ.11 కోట్లు గెలుచుకున్నారు. లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తన ఫ్రెండ్ దగ్గర రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. తాజాగా లాటరీ గెలవడంతో సెహ్రా కృతజ్ఞతగా స్నేహితుడి కుమార్తెకు రూ. కోటి బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బును ఇల్లు, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం వాడతానన్నారు.
News November 6, 2025
నఖ్వీపై తాడోపేడో తేల్చుకొనే పనిలో BCCI

దుబాయ్లో ఈనెల 7న జరిగే ICC మీటింగ్లో ACC అధ్యక్షుడు నఖ్వీపై తాడోపేడో తేల్చుకోవాలని BCCI నిర్ణయించుకుంది. ఆసియాకప్ విజేత ఇండియా టీమ్కు ట్రోఫీ అప్పగించకపోవడంపై నిలదీయనుంది. నఖ్వీపై పలు అభియోగాలనూ సిద్ధం చేసింది. పాక్ మంత్రిగా ఉన్న ఆయన ACC పదవికి అనర్హుడని, తప్పించాలని వాదించనుంది. దీనికి AFG బోర్డూ మద్దతు తెలిపే అవకాశముంది. కాగా ఈ భేటీకి నఖ్వీ గైర్హాజరు కావచ్చని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
News November 6, 2025
పెద్దపల్లి: SC సంక్షేమ శాఖపై కలెక్టర్ సమీక్ష

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష SC సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చిమొక్కలు తొలగించి పారిశుధ్యాన్ని కాపాడాలన్నారు. మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. నాణ్యమైన ఆహారం, మెనూ అమలు, స్కాలర్షిప్ దరఖాస్తుల పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.


