News April 4, 2025
MNCL: జాతీయస్థాయి పోటీలకు హాసిని ఎంపిక

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి ఖేలో ఇండియా ఉషూ లీగ్ పోటీలకు మంచిర్యాల జిల్లాకు చెందిన అటుకపుర హాసిని ఎంపికైంది. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వేముల సతీష్, ఆవుల రాజనర్సు వివరాలు వెల్లడించారు. సౌత్ జోన్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. హాసినిని కోచ్ శివమహేష్, అసోసియేషన్ సభ్యులు, పలువురు అభినందించారు.
Similar News
News January 8, 2026
మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాం: ఎస్పీ

వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది.. ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అన్నారు. అపరిచిత వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయండాని సూచించారు.
News January 8, 2026
నగరంలో ఆహార కల్తీని ఉపేక్షించేది లేదు: సజ్జనార్

నగరంలో ఆహార కల్తీని ఉపేక్షించేది లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. సీపీ మాట్లాడుతూ.. వ్యాపారులనే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని, ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ పాసీజర్ను రూపొందించి అమలు చేస్తామన్నారు.
News January 8, 2026
విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0

విశాఖ వైభవాన్ని మరింత చాటిచెప్పేలా పోర్ట్స్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీల్లో MGM పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వహించనున్నట్లు JC మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. ఫెస్టివల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేశ్ గోపి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.


