News April 4, 2025

నాగర్‌కర్నూల్: పెద్దపులి దాడి.. యజమానులకు నష్టపరిహారం

image

NGKL జిల్లా అచ్చంపేట ప్రాంతంలో రెండు నెలల క్రితం పెద్దపులి దాడిలో మృతిచెందిన పశువుల యజమానులకు అటవీ శాఖ నష్టపరిహారం అందజేసింది. బక్క లింగాయపల్లి, దండాలం గ్రామాలకు చెందిన హరి, వెంకట్రామ్, రాకేశ్‌కు వరుసగా రూ.15,000, రూ.15,000, రూ.12,000 చొప్పున చెక్కులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబూర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నరేంద్ర, అధికారులు బాలరాజు, జ్యోతి, రజిత తదితరులు ఉన్నారు.

Similar News

News November 7, 2025

నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?

News November 7, 2025

చినప్పన్న పాలెం మాజీ సర్పంచ్ అచ్చియ్యదొర మృతి

image

వైసీపీ నేత, చిన్నప్పన్నపాలెం మాజీ సర్పంచ్ దొండా అచ్చియ్య దొర మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం తన ఇంటి వద్ద మెట్ల పైనుంచి జారిపడి గాయపడ్డారు. అనకాపల్లిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. బుచ్చయ్యపేట (M) కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. మూడు దఫాలు సర్పంచ్‌గా, రెండు దఫాలు పాల సంఘం అధ్యక్షుడిగా, వడ్డాది పీఏసీఎస్ ఉపాధ్యక్షుడిగా, కస్పా నీటి సంఘం అధ్యక్షుడిగా ఆయన పని చేశారు.

News November 7, 2025

వానొస్తే.. ట్రైసిటీ హడల్‌..!

image

ఉమ్మడి WGLలో ఇటీవల సంభవించిన వరదలు ట్రైసిటీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం అంటేనే నాళాల పక్కన ఉన్న కాలనీల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏ సమయానికి వరదలు వచ్చి ఇళ్లు మునుగుతాయోనని, ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. WGLలో CM పర్యటించినా, ముంపునకు శాశ్వత పరిష్కారం దొరకలేదని, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మీ కాలనీకి వరద వచ్చిందా?