News April 4, 2025
తిర్యాణి: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్లో ఎంగేజ్మెంట్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 11, 2025
స్టాక్ మార్కెట్లకు 2 రోజులు సెలవులు

వచ్చేవారం స్టాక్ మార్కెట్లు మూడు రోజులే నడవనున్నాయి. రెండు రోజులు సెలవులు ఉంటాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు తెరుచుకోవు. మంగళ, బుధ, గురువారం వర్కింగ్ డేస్ కాగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని శుక్రవారం హాలిడే ఉండనుంది. శని, ఆదివారం యథావిధిగా వారాంతపు సెలవులు కొనసాగనున్నాయి. కాగా ఇవాళ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన <<16065141>>విషయం<<>> తెలిసిందే.
News April 11, 2025
యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం

కడప: కశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో యోగి వేమన విశ్వవిద్యాలయానికి స్వర్ణ పతకం లభించింది. విద్యార్థి డి.మురళీకృష్ణ 59వ కేజీల విభాగంలో బంగారు పతకం సాధించారు. వైవీయూకు ఈ పతకం ఐదవది. వర్సిటీ క్రీడా బోర్డు సహాయ సహకారాలు అందజేయడం ద్వారా ఈ పతకం సొంతమైనట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ రామ సుబ్బారెడ్డి తెలిపారు.
News April 11, 2025
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని చీఫ్ ఇంజనీర్(ఇరిగేషన్), NLG డివిజన్ పరిధిలోని కార్యాలయంలో లష్కర్(229), హెల్పర్(56) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి జిల్లా ఉపాది కల్పన కార్యాలయంలో ఎంప్యానెల్ అయినటువంటి ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.