News April 4, 2025

ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలి: జనగాం కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ట్రాక్టర్‌లకు జీపీఎస్ ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. ఏ గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారో ఆ రాకపోకలకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.

Similar News

News April 11, 2025

భద్రాద్రి: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్రగాయాలైన విషాద ఘటన భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దినేశ్‌గా గుర్తించారు. ప్రస్తుతం కుమారుడు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు.

News April 11, 2025

విశాఖ: దారి దోపిడీ చేసిన మైనర్‌ను పట్టుకున్న పోలీసులు

image

విశాఖలో దారి దోపిడీ చేసిన 17 ఏళ్ల మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు క్రైమ్ డీసీపీ లతా మాధురి శుక్రవారం తెలిపారు. ఈనెల 10న స్టీల్‌ప్లాంట్ పరిధిలో ఓ మైనర్‌ ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. తుమ్మగంటి కిషోర్ ఆ రైడ్ పిక్ చేసుకొని మైనర్‌‌ను తీసుకెళ్తుండగా నిర్మానుష ప్రదేశంలో వాహనం ఆపి డ్రైవర్‌ను కొట్టి రూ.48,100 లాక్కున్నాడు. కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీపీ ఆదేశాల మేరకు ఆ మైనర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

News April 11, 2025

తాండూరులో రేపు మాంసం దుకాణాలు బంద్

image

హనుమాన్ జయంతి సందర్భంగా తాండూరులో రేపు మాంసం దుకాణాలు బంద్ పాటించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాలతో పట్టణంలోని చికెన్, మటన్, ఫిష్ మాంసం దుకాణాల వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. శనివారం పట్టణంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించాలని తెలిపారు. దుకాణాలే కాకుండా హోటల్స్, రెస్టారెంట్లులో ఎక్కడా మాంసం విక్రయాలు చేపట్టరాదని నోటీసులో తెలిపారు.

error: Content is protected !!