News April 4, 2025

గద్వాల జిల్లా ఎస్పీ ఆదేశాలు 

image

వేధింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న న్యాయసలహా, తదితర సేవలు సత్వరమే అందించాలని, వేధింపులు గురైన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా సెంటర్ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు.

Similar News

News April 12, 2025

KKR చేతిలో ఓటమిపై ధోనీ ఏమన్నారంటే?

image

కేకేఆర్ చేతిలో ఓటమిపై సీఎస్కే కెప్టెన్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు పడటం ఇతర బ్యాటర్లపై ప్రభావం చూపిందన్నారు. సరిపోయేంత రన్స్ కొట్టలేదని భావిస్తున్నట్లు తెలిపారు. సవాల్‌ను స్వీకరించి పరుగులు రాబట్టేందుకు మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. వెంట వెంటనే వికెట్లు పడటంతో సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోయామన్నారు.

News April 12, 2025

సెక్షన్-111 పెట్టడంపై జడ్జి ఆగ్రహం.. అసలేంటిది?

image

ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే.. అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. BNSలోని సెక్షన్-111(1) వ్యవస్థీకృత నేరాన్ని సూచిస్తుంది. కిడ్నాప్, దొంగతనం, వాహనాల చోరీ, భూకబ్జా మొదలైన నేరాలు దీని కిందకు వస్తాయి. తాజాగా వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన <<16067210>>కిరణ్‌పై<<>> పోలీసులు ఈ కేసు పెట్టడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 12, 2025

 రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం: మంత్రి రాజనర్సింహ

image

రూ. 2700 కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల 174వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఉస్మానియా కళాశాల, ఆసుపత్రి ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినవని తెలిపారు.

error: Content is protected !!