News April 4, 2025

ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడగాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులను ఎక్కువ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి విద్యార్థులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇస్లామియా కళాశాలలో కొనసాగుతున్న అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 5వ తరగతి విద్యార్థులతో కాసేపు కలెక్టర్ ముచ్చటించారు. రోజు న్యూస్ పేపర్ చదివి వార్తలు తెలుసుకోవాలని అన్నారు. పాఠశాలలో మెనూ పాటించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News January 14, 2026

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వాయిదా

image

ఇవాళ విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్‌ను <>UPSC<<>> వాయిదా వేసింది. అడ్మినిస్ట్రేషన్ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏటా సివిల్ సర్వీసు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsc.gov.in

News January 14, 2026

ఖమ్మం జిల్లాలో 1,43,320 మంది ఓటర్లు

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,43,320 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా ఏదులాపురంలో 45,256 మంది ఓటర్లు ఉండగా.. తక్కువగా కల్లూరులో 18,866 మంది ఉన్నారు. సత్తుపల్లి 28,830, మధిర 25,679, వైరా 24,689 ఓటర్లతో మున్సిపల్ బరి సిద్ధమైంది. ఓటర్ల జాబితా ఖరారు కావడంతో రాజకీయ సందడి మొదలైంది.

News January 14, 2026

వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

image

AP: టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.