News April 4, 2025
నేడు భద్రాచలంలో మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు గోదావరి కరకట్ట పరిశీలన, 10:30 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్ల పనులు పరిశీలించనున్నారు. 11:30 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
సిద్దిపేట: ‘నెత్తురు చిందించిన నేల బైరాన్పల్లి’

రజాకార్ల ఆగడాలను భరించలేక పిడికిళ్లు బిగించి నిజాంల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వడిశెల రాళ్లతో రజాకార్లకు జవాబు చెప్పిన యోధులను కన్న ఊరు బైరాన్ పల్లి. రజాకార్లకు ఎదురు నిలిచి నెత్తురు చిందించిన పల్లెల్లో ఒకటి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లిలో రజాకార్లు జరిపిన దాడిలో 119 మంది యోధులు నేలకొరిగారు. ఈ మారణకాండ అమృత్ సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తుచేసింది.
News September 17, 2025
MDK: దున్నేవాడికే భూమిని పంచిన వ్యక్తి ‘కేవల్ కిషన్’

మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఒక్కటి చేశారు ఆయనే మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన కేవల్ కిషన్. ప్రజా పోరాటాలు చేసి భూ పోరాటాలతో నిజాం సర్కార్ను గడగడలాడించారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా తన పంథాను మార్చుకోలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దున్నేవాడికే భూమి అంటూ పేదలకు భూములు పంచి పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
News September 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 17, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.